Saturday, April 27, 2024

పొదిలిలో విద్యుదాఘాతం.. ఒకరు మృతి

పొదిలి: ప్ర‌కాశం జిల్లా పొదిలి పట్టణంలో ఓ ప్రాంతంలో సంభ‌వించిన విద్యుదాఘాతానికి ఒక వ్య‌క్తి మృతి చెందాడు. విశ్వనాధపురం రాజు హాస్పిట‌ల్ వీధి లో విద్యుత్ షాక్ తో దొండపాటి లక్ష్మయ్య (45) మృతి చెందిన సంఘ‌ట‌న కొద్దిసేప‌టి క్రితం జ‌రిగింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొండపాటి లక్ష్మయ్య బేల్దారి వృత్తి చేసుకుంటూ జీవిస్తుంటాడు. గురువారం ఉదయం రాజు హాస్పిటల్ వీధి లో నిర్మిస్తున్న భవనానికి క్యారింగ్ చేసే క్రమంలో మొటర్ హైరింగ్ కాలిపోయి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement