Monday, April 29, 2024

Flash: పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు

మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 39 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు అయ్యింది. 30 పోలీసు యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారంటూ రాప్తాడు ఏఎస్‌ఐ దస్తగిరి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రాఘవరెడ్డి పరిటాల సునీత, శ్రీరామ్‌తో పాటు 39 మంది టీడీపీ నేతలపై 143, 341, 188ఆర్డబ్ల్యూ ,34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్ హెచ్ -44 జాతీయ రహదారిలో బెంగళూరు వైపు వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో పాటు తహశీల్దార్ కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారంటూ ఏఎస్‌ఐ దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement