Thursday, May 16, 2024

కొల్హాపూర్‌ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్‌ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్‌ దంపతులకు ఆశీర్వచనం అందించారు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కాగా, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి దేవాలయం ఏడవ శక్తి పీఠం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement