Sunday, April 28, 2024

ప్రధాని మోడీని క‌లిసిన – వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

ఢిల్లీలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిశారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఈ సంద‌ర్భంగా మోడీకి శాలువా క‌ప్పి ..స‌న్మానించారు విజ‌య‌సాయిరెడ్డి. అనంత‌రం మోడీకి వినాయ‌కుడి ప్ర‌తిమ‌ను అంద‌జేశారాయ‌న‌. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రధానిని కలిసి ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై చర్చించినట్టు విజయసాయి తెలిపారు. అంతకుముందు, విజయసాయిరెడ్డిని ఆయన కార్యాలయంలో కొందరు తెలుగు విద్యార్థులు కలిశారు. వారు ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. మన తెలుగు విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందని విజయసాయి ఓ ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ వర్సిటీలో చదువుకుంటున్న ఆ తెలుగు విద్యార్థులు అదే సమయంలో సివిల్స్ కు సన్నద్ధమవుతున్నారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement