Wednesday, May 15, 2024

యాదాద్రిలో యాథావిధిగా మహాకుంభ సంప్రోక్షణ

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను యాథావిధిగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎన్‌ గీత వెల్లడించారు. ఆలయ పునఃప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి బాలాలయంలో యజ్ఞ, హోమాలు, వివిధ రకాల పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కొండ కింద వసతుల కల్పన, యాగశాల పనులు పూర్తికానందున కొండ కింద యాగస్థలిలో నిర్వహించాల్సిన మహా సుదర్శన నారసింహ యాగాన్ని వాయిదా వేసినట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు మహా సుదర్శన నారసింహ యాగానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మార్చి 28 వరకు బాలాలయంలో స్వామివారి దర్శనాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అనంతరం బాలాలయంలో నెలకొల్పిన కవచమూర్తులను ప్రధానాలయానికి తరలిస్తామన్నారు. ఆ తరువాత బాలాలయాన్ని మూసివేయనున్నట్టు ఆమె వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement