Monday, May 6, 2024

గుడ్ న్యూస్.. దేశంలో మరింత తగ్గిన కరోనా.. 24 గంటల్లో 13 వేల కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,405 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 235 మంది మరణించారు. అదే సమయంలో మొత్తం 34,226 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 1.24శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,28,51,929కి చేరింది. ఇందులో మొత్తం 4,21,58,510 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,81,075 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 5,12,344 మంది కరోనాతో మరణించారు. దేశంలో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం కరోనా డోసుల సంఖ్య 1,75,83,27,441కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement