Sunday, May 5, 2024

Karnataka: మైనర్​ బాలికలపై మఠాధిపతి లైంగిక దాడులు.. ఆ పని కోసం ప్రత్యేక బాత్​రూమ్​ నిర్మాణం

లింగాయత్​ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణారావుపై పోలీసుల దర్యాప్తు పూర్తయ్యింది. ఈ క్రమంలో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో శివమూర్తి మఠంలోని బాలికలపై పదేండ్లుగా అత్యాచారం చేస్తున్నట్టు వెల్లడయ్యింది. ఈ విషయాన్ని సోమవారం పోలీసులు ధ్రువీకరించారు. కాగా, ప్రస్తుతం శిమూర్తి మురగ రేప్​ కేసులో చిత్రదుర్గ జిల్లా జైలులో ఉన్నారు.

చిత్రదుర్గ మురుఘా మఠంలో దాదాపు 10 ఏళ్లుగా మైనర్‌లను లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాధితుల్లో కొంతమందికి అబార్షన్లు కూడా చేయాల్సి వచ్చిందని, ఇంకొంతమంది అతని విపరీత చేష్టలను తట్టుకోలేక మఠం హాస్టల్‌ను విడిచిపెట్టి అదృశ్యమయ్యారని తెలుస్తోంది. నిందితుడు మఠంలోని అనాథ పిల్లలను ‘బసవ’ అని పిలిచే వారిని లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది.

ఇక.. ‘ఆనంద యాత్ర’ కోసం శివమూర్తి మురుగ థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అతని విదేశీ పర్యటనలపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. నిందితుడు అత్యాధునిక బాత్‌రూమ్‌ను నిర్మించాడని, అక్కడ మైనర్‌ బాలికలను పిలుచుకుని లైంగిక దాడికి పాల్పడేవాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా తనకు సహకరించాలని అమ్మాయిలను ఒప్పించడం కోసం, తన అవసరాలను తీర్చడానికి కొంతమంది అబ్బాయిల బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement