Friday, May 3, 2024

రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ తో ‘స‌చిన్’ భేటీ

రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ని క‌లిశారు లెజండ‌రీ క్రికెట‌ర్ స‌చిన టెండూల్క‌ర్. ముంబైలోని రాజ్భ‌వ‌న్ లో స‌మావేశం జ‌రిగింది. కాగా ప‌లు అంశాల‌పై వారు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. . ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఇది మర్యాద పూర్వక భేటీయేనని స‌మాచారం. రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 25తో ముగియనుంది. మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడం గమనార్హం. మరోవైపు ‘‘మీకు వంద కోట్ల మందికిపైగా మద్దతు బలం ఉంది. మంచిగా ఆడి, మెరుగైన ఫలితాలు సాధించాలి’’అంటూ భారత జట్టుకు సచిన్ పిలుపునివ్వడం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement