Sunday, May 5, 2024

KTR: జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్‌ మరో ట్వీట్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మరోసారి ట్వీట్‌ చేశారు. ‘‘కర్ణాటకలో సీఎం కావాలంటే రూ. 2,500 కోట్లు అడుగుతున్నారట. మీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 40% కమిషన్‌ ఇవ్వాలని గుత్తేదారులు, 30% కమిషన్‌ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు అంటున్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారు? ఈడీ, ఐటీ, సీబీఐలకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement