Monday, April 29, 2024

జీఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ అధికారుల గైర్హాజరు

హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఏపీ నుంచి ఇరిగేషన్ ఈఎన్సీలు, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీలు, బోర్డు సభ్యులు హాజరయ్యారు. అయితే, సంయుక్త సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు అయ్యారు. పూర్తి స్థాయి బోర్డు మీటింగ్‌లు నిర్వహించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. నిన్న జీఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. తాజాగా నేడు కృష్ణా బోర్డు చైర్మన్‌కు కూడా పూర్తి స్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement