Tuesday, April 23, 2024

ఆచార్య సినిమాపై కొత్త అప్డేట్!!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు రాంచరణ్ కూడా నటిస్తున్నారు. ఇక చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది.

ఇటీవల కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో చాలా వరకు సినిమాలు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆచార్య కూడా రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నిరోజులలో షూట్ మొత్తం కంప్లీట్ అయ్యాక అప్డేట్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement