Monday, April 29, 2024

మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరం..!

మునుగోడు ఉపఎన్నికల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాయి. అయితే ఇక్క‌డ‌ కాంగ్రెస్ కు షాక్ తగిలిందనే చెప్ప‌వ‌చ్చు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ప్రచారానికి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది. ఈనెల 15న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారని సమాచారం.

ఇప్పటి వరకు మునుగోడులో అడుగుపెట్టని సిట్టింగ్ ఎంపీగా వెంకట్ రెడ్డి నిలిచారు. అంతేకాకుండా మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ తర్వాతే హైదరాబాద్ తిరిగి వస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. విదేశీ ప‌ర్య‌ట‌న‌కు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. బైపోల్ ఫ‌లితాల త‌ర్వాత కోమ‌టిరెడ్డి ఇండియాకు వ‌స్తార‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement