Monday, May 13, 2024

వ‌సూళ్ల ప‌రంగా కొత్త రికార్డులు సెట్ చేస్తోన్న కేజీఎఫ్2

ఈ నెల 14న థియేట‌ర్ లో రిలీజ్ అయి క‌లెక్ష‌న్ల వ‌ర్షాన్ని కురిపిస్తోంది కేజీఎఫ్ చిత్రం.విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 121.30 కోట్ల గ్రాస్ ను .. 75.45 కోట్ల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 942 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. వసూళ్ల పరంగా ఇంకా ఈ సినిమా కొత్త రికార్డులను సెట్ చేసే పనిలోనే ఉంది. ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. హీరో యశ్ యాక్టింగ్ .. సంజయ్ దత్ విలనిజం .. ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. పార్టు 3 కూడా ఉంటుందని యశ్ చెప్పిన దగ్గర నుంచి అందరిలో మళ్లీ ఆసక్తి మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement