Sunday, May 5, 2024

ఏప్రిల్ 25న కేదార్ నాథ్ యాత్ర‌.. వివ‌రాలు మీకోసం

ఏప్రిల్ 25న కేదార్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. దాంతో కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్‌లను భక్తులందరికీ ఏప్రిల్ 25న తెరవనున్నట్లు అధికారులు నేడు తెలిపారు. భక్తులు కాలినడకతో కానీ, హెలికాప్టర్‌లో కానీ కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సిటిసి) ఆన్‌లైన్ బుకింగ్ అథరైజేషన్ పొందింది. చార్‌ధామ్ యాత్రకు వెళ్లడం కోసం.. మొత్తం 6.34 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో తెలిపింది. ఇప్పటి వరకు, 6.34 లక్షల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు.

వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షలు, బద్రీనాథ్ ధామ్‌కు 2.01 లక్షలు, యమనోత్రికి 95,107, గంగోత్రి ధామ్‌కు 96,449 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు అని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ తెలిపింది. చార్‌ధామ్ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేస్తామని, ఈ సౌకర్యంతో భక్తులకు చాలా సౌకర్యాలు లభిస్తాయని, చార్ ధామ్ యాత్ర మార్గంలో వైద్య సౌకర్యాల పటిష్టతకు ఇది మంచి ముందడుగు అని ముఖ్యమంత్రి ధామి వెల్ల‌డించారు.ముందుగా మార్చి 11న రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 22న ప్రారంభం కానున్న చార్ధామ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభించింది. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ తీర్థయాత్రలలో ఒకటి. ఈ తీర్థయాత్ర నాలుగు పవిత్ర స్థలాల పర్యటన – బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, హిమాలయాలలో అత్యంత ఎత్తైన యమునోత్రితో కలిసి ఉంటుంది. ఎత్తైన ప్రదేశాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు యేటా దాదాపు ఆరు నెలల పాటు మూసివేయబడతాయి, వేసవిలో.. ఏప్రిల్ లేదా మేలో తెరుస్తారు. శీతాకాలం అక్టోబర్ లేదా నవంబర్ ప్రారంభంలో ఈ పుణ్యక్షేత్రాలను మూసేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement