తాజాగా రిలీజ్ అయిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం మెదటి రోజు 3.55 కోట్లు కలెక్ట్ చేస్తే 6వ రోజు ఏకంగా ఐదురేట్లు అధికంగా అంటే 19కోట్లక పైగానే కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రం 87.40 కోట్ల కలెక్షన్లను సాధించి 100కోట్ల క్లబ్కు దగ్గరలో ఉంది. వివేక్ అగ్నిహోత్రీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. కాశ్మీర్ పండిట్లపై జరిగిన సామూహిక హత్యకాండ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
అయితే తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేది ప్రకటన వచ్చింది. ఈ మూవీ మే 6 నుంచి జీ-5లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటి వరకు ఎంత పెద్ద సినిమా అయినా నాలుగు వారాలలోపే ఓటీటీలోకి వచ్చింది. కానీ ఈ చిత్రం మాత్రం విడుదలైన 56రోజులకు డిజిటల్లోకి రానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..