Sunday, May 5, 2024

హర్యానాలో హోలీ వేడుకలు.. సంబురాల్లో గవర్నర్​ దత్తన్నతో ఇతర ప్రముఖులు

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో “హోలీ మిలన్ సమరోహ్”ని నిర్వహించినట్టు గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి కైలాస్ నగేష్ తెలిపారు. కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్యానా విధానసభ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హర్యానా ప్రధాన కార్యదర్శి సంజీవ్ కౌశల్, హర్యానా సీఎం ప్రధాన కార్యదర్శి డిఎస్ ధేసి, గవర్నర్ కార్యదర్శి అతుల్ ద్వివేది, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ విపి మాలిక్, సీనియర్ బ్యూరోక్రాట్‌లు, ఇతర ప్రముఖులు “హోలీ మిలన్ సమరోహ్‌’’లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement