Tuesday, April 30, 2024

తెలంగాణ‌లో దొరికిన‌ క‌ర్ణాట‌క ఆర్టీసీ బ‌స్సు..

ఏకంగా ఆర్టీసీ బ‌స్సునే ఎత్తుకెళ్లారు దొంగ‌లు.ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటు చేసుకుంది. రాత్రిపూట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సు తెల్లారేసరికి మాయమైంది. దీంతో ఆర్టీసీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కలబురిగి జిల్లా చించోలి బస్టాండ్ లో ఈ దొంగతనం జరిగింది. బీదర్-2 డిపోకు చెందిన KA-38 F-971 బస్సు చించోలి-బీదర్ మధ్య రాకపోకలు సాగిస్తుంది. రాత్రి బీదర్ నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. అదే లాస్ట్ ట్రిప్ కావడంతో డ్రైవర్ ఆ బస్సును బస్టాండ్ లో పార్క్ చేశారు. ఉదయం బీదర్ తీసుకెళ్లేందుకు వచ్చిన డ్రైవర్ కు బస్సు కనిపించలేదు.దీంతో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించగా తెలంగాణలో బస్సు దొరికింది. అయితే ఆ బస్సును ఎవరు దొంగిలించారు, తెలంగాణ వ‌ర‌కు ఎలా తీసుకొచ్చారనే విషయం ఇంకా తెలియరాలేదు.పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement