Monday, April 29, 2024

సికింద్రాబాద్‌లో అగ్ని ప్రమాదం.. షాపులో భారీగా చెలరేగిన మంటలు..

నగరంలో అగ్నిప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎండాకాలం పూర్తిగా రాకమునుపై గోదాముల్లో, షాపుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతన్నారు. తాజాగా సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది గంటసేపు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement