Saturday, April 27, 2024

ఏప్రిల్ 14న ఓటీటీలో – జేమ్స్ చిత్రం

మార్చి 17న విడుద‌ల‌యింది క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ న‌టించిన ఆఖ‌రి చిత్రం జేమ్స్. ఈ చిత్రానికి పెద్ద ఎత్తున జనం నీరాజనాలు పలికారు. జేమ్స్ విడుదలైన అన్ని థియేటర్లను దేవాలయాల్లాగా ముస్తాబు చేశారు. తమ అభిమాన హీరోను చివరి సారిగా తెరపై చూస్తున్నామని తెలిసి.. ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతూనే సినిమా చూశారు. సినిమాను పెద్ద హిట్ చేశారు.
ఇదిలా ఉంటే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 14న సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో జేమ్స్ ను విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement