Friday, April 26, 2024

కలెక్టర్ వాహనానికి రూ.22,905 జరిమానా!

ట్రాఫిక్​ రూల్స్ ఎవరికైనా ఒకటే. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు తప్పవు. అది  సామాన్యుల వాహనమైనా.. అధికారుల వాహనమైనా చలాన్​ కట్టాల్సిందే. అయితే, రూల్స్ చెప్పాల్సిన అధికారులే నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇలాగే అధిక వేగంతో వెళ్తూ స్పీడ్​ గన్​కు చిక్కిన ఓ ఉన్నతాధికారి వాహనానికి ఏకం 23 చలాన్లు పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే… జనగామ కలెక్టర్ ప్రభుత్వ వాహనానికి గడిచిన రెండేళ్లలో ఏకంగా 23 సార్లు జరిమానాలు పడ్డాయి. వీటిలో 22సార్లు ఓవర్ స్పీడ్‌కు కాగా… ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రా క్రాసింగ్ చేసినందుకు చలానాలు విధించారు. ఈ చలానాల మొత్తం రూ. 22,100 కాగా.. యూజర్ ఛార్జీలు రూ.805 కలుపుకొని మొత్తం 22,905 కట్టాల్సి ఉంది. ఈ చలానాల్లో సగానికి పైగా హైదరాబాద్‌ రింగ్ రోడ్డుపై ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లినందుకే విధించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. కలెక్టర్‌ వాహనంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అధికారుల వాహనాలపై కూడా చర్యలు తీసుకోవాలని, నియమ నిబంధనలు పాటించడంలో ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: గణనాథుడి చుట్టూ ఏపీ పాటిలిక్స్ !

Advertisement

తాజా వార్తలు

Advertisement