Thursday, May 2, 2024

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కు రిలీఫ్.. విడిచిపెట్టిన ఈడీ అధికారులు!

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ముంబై విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు స్వల్ప నిర్బంధం తర్వాత ఆమెను విడిచిపెట్టారు. ముంబై విడిచి వెళ్లేందుకు అనుమతించారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. విచారణ సమయంలో సుఖేశ్ జాక్వెలిన్ పేరు కూడా వెల్లడించినట్టు సమాచారం. అంతేకాదు, సుఖేశ్ ఆమెకు రూ.50 లక్షలకు పైగా విలువ చేసే గుర్రం, రూ.9 లక్షల విలువ చేసే పిల్లిని బహుమానంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జాక్వెలిన్ కు సమన్లు జారీ చేసింది.

ఈడీ విచారణకు హాజరైన జాక్వెలిన్‌పై కొన్నాళ్ల కిందట లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ముంబై విమానాశ్రయానికి వచ్చిన ఆమెని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ తర్వాత వారు ఆ విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాలపై జాక్వెలిన్‌ను వదిలిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement