Friday, April 26, 2024

నేడు ప్రధాని మోడీతో భేటీ కానున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక రోజు పర్యటన నిమిత్తం నేడు భారత్ రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మధ్య సోమవారం ద్వైపాక్షిక సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా కీలకమైన రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ, పుతిన్‌ మధ్య ద్వైపాక్షిక సదస్సు ఈ సాయంత్రం ఐదున్నర గంటలకు జరగనుంది. రాత్రి తొమిదిన్నర గంటలకు పుతిన్‌ రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement