Monday, April 29, 2024

ఎవరు మీలో కోటీశ్వరులు హ్యాపీ ఎండింగ్..25 లక్షలు గెలుచుకున్న మహేష్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకు అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రత్యేక ఎపిసోడ్‌ను నిన్న సాయంత్రం ప్రసారం చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్‌కి మంచి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఈ షో గ్రాండ్‌గా ముగియబోతోందని, ఈ చివరి ఎపిసోడ్ లో మహేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. మహేష్ లోపలికి వెళ్లగానే సాదరంగా హాగ్ ఇచ్చి ఆహ్వానించారు. మహేష్ సైతం సెట్ బాగుందని మెచ్చుకున్నారు. ఈ షోలో మహేష్ 25 లక్షలు గెలుచుకున్నారు. అంతేకాదు వీరిద్దరి మధ్య షో ఆద్యంతం సాగిన సంభాషణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు సూపర్ స్టార్ మహేష్ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు బుల్లితెరపై సందడి చేయడం అభిమానులకు అలరించింది. మహేష్ బాబు ఇలాంటి గేమ్ షో లో పాల్గొనడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement