Monday, April 29, 2024

బిజెపి గూటికి తెలంగాణ ఉద్యమ నేత

తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సీహెచ్ విఠల్ నేడు బీజేపీలో చేరబోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, కో-చైర్మన్‌గా కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విఠల్ టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగానూ పనిచేశారు. తెలంగాణ విఠల్‌గా అందరికీ సుపరిచితుడైన విఠల్ పదవీ కాలం ఏడాది క్రితమే ముగిసింది. నిన్న ఢిల్లీకి వెళ్లిన ఆయన నేడు కమలం తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆ పార్టీ వర్గాలు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement