మహారాష్ట్రలోని తన నియోజకవర్గం ధరంగావ్లో రోడ్లు అలనాటి నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉన్నాయని శివసేన సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్రావు పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ కామెంట్స్పై ఇవాళ హేమమాలిని స్పందించారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సాంప్రదాయాన్ని గతంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ మొదలుపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు.
అయితే ఇలాంటి కామెంట్లు మంచివి కావని హేమమాలిని అన్నారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్లు చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని అన్నారు. మీ బుగ్గలపై కామెంట్ చేసినందుకు గులాబ్రావు పాటిల్ను క్షమాపణ కోరుతారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాను ఆ వ్యాఖ్యలను పట్టించుకోనని హేమమాలిని స్పష్టంచేశారు.