Friday, April 19, 2024

నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు: వైసీపీ నేతలకు నారా భువనేశ్వరి సూచన

ఇటీవల ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. నోటికొచ్చినట్టు ఆడవాళ్లపై మాట్లాడొద్దు అని ఆమె అన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలపై బాధపడ్డానని, నా భర్త చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసినవారు వాళ్లపాపాన వాళ్లేపోతారు అని చెప్పారు. వాళ్ల క్షమాపణ నాకు అక్కర్లేదు అని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు పట్టించుకుని టైమ్ వేస్ట్ చేసుకోనన్న భువనేశ్వరి.. బాధలో ఉన్న తనకు కుటుంబం అండగా నిలిచిందన్నారు. హెరిటేజ్‍ను ఎవరూ టచ్ చేయలేరు నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement