Thursday, May 2, 2024

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు

ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్వీ-సీ 52 ప్రయోగం విజయవంతం కావాలంటూ, రాకెట్‌ నమూనాను మూలవిరాట్టు పాదాల దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. ఆలయ అధికారులు..శాస్త్రవేత్తలకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నెల 14న ఉదయం 5గంటల 59 నిమిషాలకు శ్రీహరికోట షార్‌ నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్వీ-సీ 52 ప్రయోగం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకున్న‌ట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement