Tuesday, April 30, 2024

Who is shy: ఇంత సాహసం చేసిన రాహుల్​ పిరికివాడెట్లయితడు!!

బారత ప్రజలకు కేంద్ర చేస్తున్న దుర్మార్గాలను తెలియజేస్తూ… కాంగ్రెస్​ శ్రేణుల్లో ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ  పార్టీ అధినేత రాహుల్​ గాంధీ ‘భారత్​ జోడో’ పేరిట పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్​ దాకా సాగనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అయిదు రోజులు పూర్తయ్యాయి. ఇవ్వాల (సోమవారం) ఆరో రోజు యాత్ర కొనసాగనుంది. ఇక.. ఈ సందర్భంగా రాహుల్​ గాంధీకి చెందిన పలు అంశాలపై సోషల్​ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దేశం కోసం తన కుటుంబంలోని పెద్దలందరినీ కోల్పోయిన వీరుడని.. వారి కుటుంబం దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిందని కొంతమంది కొనియాడుతుంటే.. ఇంకొంతమంది రాహుల్​ గాంధీ టీషర్టు ధర ఇంత అంటూ వ్యక్తి గత అంశాలపై ఛీప్​ కామెంట్స్​ చేస్తున్నారు. ఇట్లాంటి ఛీప్​ కామెంట్స్​ చేసిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్​షా వంటి వారు కూడా ఉన్నారు. అంతేకాకుండా అతనికి ధైర్యం లేదని విమర్శలు చేసిన వారికి సమాధానంగా సముద్రంలో ఒంటరిగా దూకిన వీడియో ఒకటి షేర్​ చేస్తున్నారు. ఇప్పుడీ వీడియో సోషల్​ మీడియాలో హల్​చల్​ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement