Wednesday, May 1, 2024

పాముకాటుకు విద్యార్థిని మృతి

నాలుగ‌వ తరగతి విద్యార్థిని పాము కాటువేసిన ఘ‌ట‌న పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలంలో చోటు చేసుకుంది. చింతపల్లి గ్రామంలో ఇంటివద్ద ఆరుబయట ఆడుతుండగా చిన్నారిని పాము కాటు వేయ‌డంతో కేక‌లు పెట్టింది. ఇది గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ.. చిన్నారి మార్గమధ్యలోనే మృతి చెందింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. చిన్నారి మృతితో చింతపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement