Tuesday, April 30, 2024

IPL 2022: బెంగళూరు పై పంజాబ్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి పంజాబ్ కింగ్స్-రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ వీరబాదుడుకు తోడు, దినేశ్ కార్తీక్ మెరుపులు తోడవడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 206 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్‌కు ఓపెనర్లు చక్కని శుభారంభం అందించారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 32 (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధవన్ 43 (29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్) పరుగులతో తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత భానుక రాజపక్స 43 (22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షారూఖ్ ఖాన్ 24 (20 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లు) పరుగులతో జట్టును విజయం దిశగా నడిపించారు. చివరల్లో ఓడియన్ స్మిత్ మరింతగా చెలరేగాడు. కేవలం 8 బంతుల్లోనే ఫోర్, 3 సిక్సర్లతో ఏకంగా 25 పరుగులు పిండుకోవడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి పంజాబ్ జట్టు విజయాన్ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement