Sunday, April 28, 2024

Telangana: మతం ముసుగులో ప్రజల మధ్య విద్వేషాలు.. దేశంలో ఇన్వెస్టిగేటివ్​ జర్నలిజం కొరవడింది: మంత్రి కేటీఆర్​

మతం ముసుగులో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న విభజన అంశాల పన్నాగాలను మీడియా, జర్నలిస్టులు బయటపెట్టాలని మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఇవ్వాల (శనివారం) ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు’ అనే అంశంపై జాతీయ సెమినార్‌ జరిగింది. ఈ ప్రోగ్రామ్​లో మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో పరిశోధనాత్మక జర్నలిజం కొరవడిందన్నారు. మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ భాగస్వామ్యంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ సదస్సును నిర్వహించింది.

శ్రీలంక ఇంధన శాఖ అధిపతి చేసిన ఆరోపణలను ప్రచురించడానికి, చర్చించడానికి లేదా పరిశీలించడానికి దేశంలోని ఏ మీడియా సంస్థ ధైర్యం చేయలేదని కేటీఆర్​ పేర్కొన్నారు. అధ్యక్షుడు రాజపక్సేపై ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి ఫలితంగా అదానీకి 6,000 కోట్ల ప్రాజెక్టు కట్టబెట్టారన్న విషయం బహిరంగ రహస్యం అయినప్పుడు దానిపై ఎందుకు ప్రత్యేక కథనాలు రాయలేదని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారని, ఆ సమయంలో ప్రధాని మీడియాతో నేరుగా మాట్లాడారా? అని ఐటీ మంత్రి ప్రశ్నించారు.

దేశంలో ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న రూపాయి సమస్యలకంటే.. హిజాబ్, హలాల్, నాన్-హలాల్ మాంసం వంటి ప్రధాన వార్తా కథనాలకు ఇంపార్టెన్స్​ పెరిగిందని కేటీఆర్​ అన్నారు.  వార్తలు, వాస్తవాలు, అభిప్రాయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తాను రోజూ 13 వార్తాపత్రికలు చదువుతాను అన్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తనకు రోజూ గంటన్నర సేపు వార్తాపత్రికలు చదవడం అలవాటు చేశారని తెలిపారు.

- Advertisement -

ఇక.. 3000 మంది మీడియా రిపోర్టర్లకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు సరఫరా చేసిన గుజరాత్‌ జర్నలిస్టులతో 19,000 మందికి అక్రిడేషన్​ ఇచ్చిన తెలంగాణతో పోల్చడం ఏమాత్రం కరెక్ట్​ కాదన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా భవన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. దేశంలోనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, పింఛన్ల కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement