Tuesday, April 30, 2024

Ink Mark – ఇన్​క్రెడిబుల్​ ఇంక్​! …దొంగ ఓట్లపై పాశుపతాస్త్రం


నకిలీ ఓట్లకు చెక్
వేలిపై ఒక్కసారి చుక్క పడితే కొన్ని వారాల దాకా చెర‌గ‌దు
1962 నుంచి మైసూరులో త‌యారు
పేటెంట్ హ‌క్కులు ఆ కంపెనీవే
1962 నుంచి వాడుక‌లోకి సిరా
5 ఎంఎల్​తో 300 మందికి గుర్తులు
విదేశాల‌కు కూడా ఎగుమ‌తి
ఇప్పటికీ ఆ ఇంక్ ఫార్ములా ర‌హ‌స్య‌మే

దేశంలో ఎన్నికలు రాగానే ప్రతీ ఒక్కరికి గుర్తుకు వచ్చేది వేలికి పెట్టే ఇంక్ ​ (సిరా చుక్క). ఎక్కడ ఎన్నికలు జరిగినా వేలిపై ఈ చుక్క పడాల్సిందే. ఆ ఇంక్​ పెట్టనిదే ఓటు వేయలేం. ఓటు వేసే ముందు ఓటరు వేలిపై సిరా ఇంక్​ను వేస్తారు. దీన్నే ఇన్‌క్రెడిబుల్ ఇంక్ అని అంటారు. మనం ఓటు వేశామనే దానికి సిరా చుక్కను ఓ గుర్తు మాత్రమే కాదు.. దొంగ ఓట్లు వేయకుండా చెక్ పెట్టే మిస్సైల్ అని చెప్పాలి. ఎన్నికల్లో నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నాక మరోసారి దొంగ ఓటు వేయకుండా.. రీసైక్లింగ్ అరికట్టడానికి భారతీయ ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్టోరల్ ఇంక్ ఓటింగ్‌లో మోసాల నుంచి రక్షించడానికి పనికొస్తోంది. ఇక ఎన్నికల్లో యూజ్ చేసే సిరాను చెరగని సిరా అంటారు. ఒకసారి వేలిపై సిరా పడితే.. కొన్ని వారాల పాటు చెరిగిపోదు.

- Advertisement -

1962 లో తొలిసారి..

ఎన్నికల్లో వాడే సిరాను కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తోంది. 1950లోనే ఈ సిరాపై పేటెంట్‌ను భారత్​లోని నేషనల్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పొందింది. ఆ తర్వాత సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కి చెందిన నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ ఈ ఇంక్‌ను డెవలప్ చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఇంక్‌ ఉత్పత్తిని మైసూర్‌ లో ఉన్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ అనే చిన్న కంపెనీకి ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. ఈ కంపెనీని 1937లో అప్పటి మైసూర్ మహారాజా కృష్ణరాజ వడియార్ 4 స్థాపించారు. ఈ కంపెనీ 1962లో జరిగిన మూడో లోక్ సభ ఎన్నికల సమయంలో ఫస్ట్ టైమ్ ఈ సిరాను మైసూర్ ప్రాంతంలో ఉపయోగించారు. అప్పటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ ఎన్నికల్లో ఈ నీలం సిరా వాడకాన్ని ఎన్నికల్లో చేర్చారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికలు ఎక్కడ జరిగినా.. అక్కడ ఈ సిరాను వాడుతున్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కంపెనీయే సిరాను సరఫరా చేస్తోంది. ఒక బాటిల్ సిరా ధర సుమారు రూ. 127 ఉంటుంది. ఒక సీసాలో 10 ఎంఎల్ సిరా ఉంటుంది. ఒక లీటర్ ఎన్నికల సిరా ధర‌ రూ. 12, 700 ఉంటుంది.

సిల్వర్ నైట్రేట్ ఉండ‌టంతో..
ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉండటం వలన ఈ సిరా వేసిన వెంటనే చెరిగిపోదు. 2006 ఫిబ్రవరి 1 నుంచి ఓటరు ఎడమ వేలు చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కింది వరకు సిరా గుర్తు వేస్తున్నారు. అంతకు ముందు గోరు పై భాగపు చర్మంపైనే వేసేవారు. దేశానికి జరిగిన తొలి రెండు ఎన్నికల్లో ఈ సిరా గుర్తు వాడలేదు.

5 ఎంఎంల్.. 300 మందికి..

దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకొని ఆర్డర్ ఇస్తుంది. వరల్డ్ లార్జెస్ట్ ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ సారి దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 30 లక్షల సిరా వయల్స్ వాడుతున్నారు. దీని కోసం రూ.55 కోట్లు ఖర్చు అవసరం. ఈ ప్రత్యేక సిరా తయారీ ఫార్ములా అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఎంపీవీఎల్ డైరెక్టర్లకు ఈ ఫార్ములా రహస్యం తెలియకుండా సీక్రెట్ మెయింటెన్ చేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేసే ఇద్దరు కెమిస్ట్‌లకు తప్ప ఎవరికీ ఈ ఇంక్ తయారీ విధానం తెలియదట. వాళ్లు లేని సమయంలో నమ్మకస్థులైన తమ తర్వాత ఉద్యోగులకు మాత్రమే ఈ ఫార్ములాను సదురు కెమిస్టులు బదిలీ చేస్తారట.

విదేశాల‌కు ఎగుమ‌తి..
భారత్​లో తయారయ్యే ఇంక్‌కు ఇంటర్నేషనల్ లెవల్లో డిమాండ్ వుంది. మన దేశంలో జరిగే లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపల్ కాకుండా.. 1976 నుంచి దాదాపు 30 పైగా దేశాలకు ఈ సిరా ఇక్కడ నుంచి ఎగుమతి అవుతోంది. పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇరాక్, లెబనాన్, శ్రీలంక, సూడాన్,టర్కీ, ఈజిప్టు వంటి దేశాల్లో జరిగే ఎన్నికల్లో మన దేశపు సిరానే ఉపయోగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement