Monday, April 29, 2024

దేశంలో 2 లక్షల దిగువకు కరోనా కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు మూడు లక్షలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదు కాగా, తాజాగా ఆ సంఖ్య రెండు లక్షలకు చేరింది. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,67,059 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా 1192 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించన వారి సంఖ్య 4,96,242కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,54,076 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,14,69,499 కు చేరింది. ఇందులో 3,92,30,198 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటి రేటు 11.69 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,66,68,48,204 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement