Friday, April 26, 2024

Covid Update: దేశంలో కరోనా మరణమృదంగం.. ఒక్కరోజే 2,796 మంది మృతి

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా..మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తుండటం ఆందోళన కల్గిస్తోంది.

కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,895 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,796 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా కేరళ, బీహార్ రాష్ట్రాల్లోనే మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటి వరకు మృతు చెందిన వారి సంఖ్య 4,73,326కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,918 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,633,255 కు చేరింది. ఇందులో 3,40,60,774 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 99,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,27,61,83,065 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement