Saturday, April 27, 2024

Corona Update: దేశంలో కొత్త 8,865 కేసులు

భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,07,617 శాంపిల్స్‌ పరీక్షించగా…కొత్తగా 8,865 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మరో 197 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 11,971 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,44,56,401 కు చేరగా.. ఇందులో 3,38,61,756 కోట్ల మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,30,793 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు మొత్తం 4,63,852 మంది కరోనాతో మరణించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement