Monday, April 29, 2024

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న 7 వేల లోపు కేసులు నమోదు కాగా.. నేడు ఆ సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్త‌గా 8,439 క‌రోనా కేసులు నమోదైయ్యాయి. కోవిడ్ తో 195 మంది  బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరక కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,73,952 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 3,46,56,822కి చేరింది. ఇందులో 3,40,89,137 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 129.5 కోట్ల‌ మందికి పైగా టీకా వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement