Saturday, April 27, 2024

India Corona: దేశంలో కొత్తగా 6,650 కోవిడ్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ.. కరోనా కేసులు ఓ రోజు తగ్గుతూ..మరో రోజు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా నిన్నటితో పోల్చితే ఇవాళ్టి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 6,650 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 374 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశవ్యాప్తగా ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,79,133కి చేరింది. ప్రస్తుతం దేశంలో 77,516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,051 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,42,15,977కు చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,40,31,63,063 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement