Friday, May 3, 2024

జడ్పిటిసి సభ్యులు ఆకస్మిక తనిఖీలు

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు జడ్పిటిసి సభ్యురాలు విష్ణు ప్రియ ముడియూరు పాఠశాల, సచివాలయాల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్థానిక సర్పంచ్ శ్యామలతో కలిసి మొదట సచివాలయానికి చేరుకున్న జడ్పిటిసి సభ్యులు.. ఓటిఎస్ పథకం అమలు తీరుపై ఆరా తీశారు. లబ్ధిదారుల చేత ఓటీఎస్ నగదును కట్టించారు. అక్కడ నుండి పాఠశాలకు చేరుకొని జగనన్న విద్యా కానుక, పాఠ్యపుస్తకాల పంపిణీ, హాజరు పట్టి వంటి రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం రోజు భోజనం అందిస్తారా అని విద్యార్థులను ఆరా తీశారు. చివరగా విద్యార్థులకు నెప్కిన్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కెవి భాస్కర్ నాయుడు, నాయకులు కిరణ్ కుమార్ నాయుడు, చెంగల్రాయ రెడ్డి, బాబు రెడ్డి, పంచాయితీ కార్యదర్శి, సచివాలయం ఉద్యోగులు, స్కూల్ హెచ్ఎం, టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement