Friday, April 26, 2024

బైక్ ను ఢీకొన్న లారీ : ఒక‌రు మృతి

లారీ ఢీకొని ఓ వ్య‌క్తి మృతిచెందిన విషాద ఘ‌ట‌న న‌గ‌రంలోని బేగంపేట‌లో చోటుచేసుకుంది. బేగంపేట క‌ట్ట‌మైస‌మ్మ ఆల‌యం వ‌ద్ద ఓ లారీ బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెళ్తున్న వ్య‌క్తి అక్క‌డికక్క‌డే మృతిచెందాడు. అయితే ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే లారీ డ్రైవ‌ర్ అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకొని మృతిచెందిన వ్య‌క్తిని మ‌ధుసూద‌న్ గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement