Saturday, May 4, 2024

India Corona: దేశంలో కొత్తగా 6,358 కేసులు.. మరణాలు ఎంతంటే..

దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం…గడిచిన 24 గంటల్లో దేశంలో 6,358 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,99,691 కు చేరింది. అదేసమయంలో దేశవ్యాప్తంగా 6,450 మంది కరోనా నుంచి కోలు కున్నారు. మరో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 75,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇప్పటివరకు మొత్తం 3,42,43,945 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,80,290 మంది బాధితులు మరణించారు. మరోవైపు దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 72,87,547 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,42,46,81,736కు చేరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement