దేశంలో ఒమిక్రాన్ కేసుల విజృంభిస్తున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కి చేరింది. ఒమిక్రాన్ నుంచి ఇప్పటివరకు 186 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. మహారాష్ట్రాలో 167, ఢిల్లీలో 165 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ కేసుల విషయంలో కేరళ మూడో స్థానంలో ఉండగా.. తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది.
కేరళలో 57, తెలంగాణలో 55, గుజరాత్ లో 49, రాజస్థాన్ లో 46,తమిళనాడులో 34, కర్ణాటలో 31, మధ్యప్రదేశ్ లో 9,ఒడిశాలో 8, ఆంధ్రప్రదేశ్ లో 6, హర్యానా, ఉత్తరాఖండ్ లో 4 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. జమ్మూకశ్మీర్, ఛత్తీస్ గఢ్ లో మూడు, ఉత్తర్ ప్రదేశ్ లో రెండు, గోవా, హిమాచల్ ప్రదేశ్, లఢాఖ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఒక్కో కేసులు నమోదైయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital