Sunday, May 5, 2024

India Corona: కరోనాతో 332 మంది మృతి

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 10,126 క‌రోనా కేసులు న‌మోదైయ్యాయి. నిన్న ఒక్క రోజే 332 మంది ప్రాణాలు కోల్పోగా.. 11,982 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం 1,40,638 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,37,75,086కు చేరుకుంది.  కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.25 శాతంగా ఉంది. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 263 రోజుల కనిష్టానికి చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,61,389 మంది కరోనాతో మరణించారు. నిన్న 59,08,440 డోసుల వ్యాక్సిన్ వేశారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 109,08,16,356 డోసుల వ్యాక్సిన్లు పంపిణీచేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement