Thursday, May 2, 2024

కవయిత్రి మొల్ల చిరస్మరణీయురాలు – భూమన

కవయిత్రి మొల్ల చిరస్మరణీయురాలు అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. స్థానిక మహతి ఆడిటోరియం ఎదుట మంగళవారం ఉదయం మొల్ల విగ్రహాన్ని భూమన ఆవిష్కరించారు. విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రతిభకు ఏదీ అడ్డు కాదని ఆమె నిరూపించారని కొనియాడారు. వాల్మీకి రామాయణాన్ని నాలుగైదు సంవత్సరాల కిందటే తెలుగులో అనువాదించారని… వాల్మీకి రామాయణమంత ప్రచుర్యాన్ని మొల్ల రామాయణం పొందిందన్నారు. అందరికీ అర్థమయ్యేలా ఆమె రచించారన్నారు. మొల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నగర పాలక సంస్థ అదృష్టమని పేర్కొన్నారు. సమాజానికి ఎంతో ప్రేరణ కలిగించారని, ఆమె విగ్రహాన్ని ఓ కులానికి పరిమితం చేయరాదని భూమన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, నిర్వాహకులు కేశవులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement