Thursday, April 25, 2024

దేశంలో కొత్తగా 29,689 క‌రోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,689 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ తో 415 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,21,382కు పెరిగింది. 42,363 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,40,951కు చేరగా.. ఇప్పటివరకు 3,06,21,469 మంది కోలుకున్నారు. 3,98,100 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 44,19,12,395 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఒక్కడే మొనగాడా?.. మునగోడుకొస్తే ఖబడ్దార్: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement