Thursday, March 28, 2024

హుజూరాబాద్ లో ఉప ఎన్నికల నిర్వహించండి: ఈసీకి గోనే ప్రకాష్ లేఖ

హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ మాజీ ఎంఎల్ ఏ గోనే ప్రకాష రావు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.  కోట్ల రూపాయలు హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఖర్చు చేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేశారు. టీఆర్ఏస్ ఖర్చు చేస్తున్న డబ్బులపై నిఘా పెట్టి వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను గోనే ప్రకాషరావు కోరారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, పోలీసు సహాయంతో టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలపై తప్పుడు కేసులు బనాయించడం, తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను కేంద్ర పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు, ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని గోనే ప్రకాషరావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement