Sunday, May 12, 2024

India Corona: దేశంలో కరోనా మరణ మృదంగం.. ఒక్క రోజే 871 మంది మృతి

భారత్ లో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. అయితే, కరోనా మరణాలు భారీగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,35,532 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 871 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,93,198 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,35,939 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,08,58,241కు చేరింది. ఇందులో  3,83,60,710 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 20,04,333 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,65,04,87,260 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement