Tuesday, April 30, 2024

India Corona: దేశంలో కొత్తగా 1549 కేసులే.. మరణాలు ఎంతంటే..

ఇండియాలో కరోనా కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు పది వేలకుపైగా నమోదు అయిన కేసుల సంఖ్య ఇప్పుడు రెండు వేల లోపు మాత్రమే నమోదు అవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1549 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. దేశంలో కరోనాతో 31 మంది మాత్రమే మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,16,510కి చేరుకుంది.  

ప్రస్తుతం దేశంలో 25,106 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసులు 0.06 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.74 శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,134 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేవంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.40 శాతంగా ఉంది. ఇక, దేశంలో ఇప్పటి వరకు 1,81,24,97,303 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement