Monday, May 6, 2024

COVID-19: దేశంలో కొత్తగా 13 వేల కరోనా కేసులు.. మరణాలు ఎంతంటే..

దేశంలో కరోనా మహమ్మారి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో 302 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,13,226కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,988 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,28,94,345 కు చేరింది. ఇందులో మొత్తం 4,22,46,884 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,34,235 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 97.82 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,76,86,89,266 కరోనా వ్యాక్సిన్లు డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement