Saturday, April 27, 2024

India Corona: దేశంలో కరోనాతో 501 మంది మృతి

దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,516 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 501 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న క‌రోనా నుంచి 13,155 మంది కోలుకున్నారు. అదే సమమయంలో యాక్టివ్ కేసులు 267 రోజుల క‌నిష్ఠానికి చేరాయి. ప్ర‌స్తుతం దేశంలో 1,37,416 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,38,14,080కు చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,62,690కి పెరిగింది. మరోవైపు దేశంలో నిన్న‌ 53,81,889 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,10,79,51,225 డోసుల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ADR Report: టాప్-3లో నిలిచిన తెలుగు ప్రాంతీయ పార్టీలు!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి 

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement