Friday, May 3, 2024

India Corona: దేశంలో తగ్గిన కరోనా.. 560 రోజుల కనిష్ఠానికి యాక్టివ్‌ కేసులు

భారత్ లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు క‌రోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్‌ ప్రకారం…గత 24 గంటల్లో కొత్త‌గా 7,774 క‌రోనా కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో కోవిడ్ తో 306 మంది  బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,75,434కు చేరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 92,281 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్‌ కేసులు 560 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు క‌రోనా నుంచి 3,41,22,795 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఇక, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 132.9 కోట్ల‌ మందికి పైగా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement